టాలీవుడ్ స్టార్ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్, పవన్ సినిమాకు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పవన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇందులో ఐబీ ఆఫీసర్గా, లెక్చరర్గా పవన్ నటించనున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో రానున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 25 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,47,727 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,085మంది మరణించారు. కొత్తగా 4,801 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,00,247కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. రెగ్యులర్ సహా గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే …
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,44,263గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3060 మంది చనిపోయారు. జిల్లాల వారీగా …
Read More »సెల్యూట్ పోలీస్
కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్మార్కెట్కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్మార్కెటింగ్కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్మార్కెటింగ్పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్ …
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్వేవ్ తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 12 నుంచి 10 రోజులపాటు లాక్డౌన్పై నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. …
Read More »టైం గ్యాపంతే…టైమింగ్ లో కాదంటున్న రీతూ
పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్ రీతూవర్మ. మొదటి మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్తోపాటు కోలీవుడ్లోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రీతూ తత్త్వమే అంత. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాల సంఖ్య లెక్కేసుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుంది. కాబట్టే, సమ్థింగ్ స్పెషల్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును సాధించుకొన్నది. …
Read More »రేణు దేశాయ్ కు కోపం వచ్చింది..ఎందుకంటే..?
సినీ నటి రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కొవిడ్-19 చికిత్స కోసం సాయం కోరుతూ తాము పంపే సందేశాలకు సరైన సమయంలో స్పందించడం లేదని కొందరు వ్యక్తులు మెస్సేజ్లు రేణూదేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రేణూ దేశాయ్.. కొన్నిరోజులుగా కొవిడ్ బాధితులకు చేయూతనందిస్తున్నారు. కొవిడ్ దావాఖానల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి తాజాగా ఓ నెటిజన్ మెస్సేజ్ చేశాడు. అయితే, దానికి ఆమె …
Read More »ఊపు మీదున్న లావణ్య త్రిపాఠి
ఈ ఏడాది ‘ఏ వన్ ఎక్స్ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రం అంగీకరించారు. రవీంద్ర మాధవన్ దర్శకత్వంలో అథర్వ మురళీ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐఏఎస్కు ప్రిపేరవుతున్న యువతిగా లావణ్య కనిపించనున్నారు. ఓ ముఠా చేతిలో కిడ్నాప్కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్ అధికారిగా అథర్వ కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని …
Read More »