త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
Read More »శ్రుతిహాసన్ పై బీజేపీ ఫిర్యాదు..ఎందుకంటే..?
మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్పై బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్హాసన్ కుమార్తె, సినీనటి శ్రుతిహాసన్ తన తండ్రితో కలిసి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ను అక్రమంగా సందర్శించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్, తన కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరలతో కలిసి చెన్నైలో ఓటు వేసిన తరువాత, నేరుగా తాను పోటీ చేస్తున్న …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. …
Read More »దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు …
Read More »మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన : మంత్రి కేటీఆర్
నానక్రామ్గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్
తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ గారు మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1679 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన …
Read More »సైకిల్ పై మంత్రి పువ్వాడ పర్యటన
ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్ పై పర్యటించారు. జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, PSR రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, …
Read More »6 వేల మీటర్ల తవ్వగల స్వదేశీ ఆయిల్ రిగ్గులు
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు …
Read More »ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం ఇండ్లకు సరఫరా చేస్తున్నం. ప్రజలను రోగాల నుంచి కాపాడగలుగుతున్నం. ఫలితంగా ప్రజారోగ్యంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. అదే సందర్భంలో తల్లీ బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతమై, మాతాశిశు సంక్షేమం మెరుగు పడింది. -ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన …
Read More »