బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది
Read More »ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 210 మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 47,803 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 210 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,227 ఉన్నాయి.. ఇప్పటివరకు 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం 7,180 మంది కరోనాతో చనిపోయారు
Read More »దేశంలో కొత్తగా 24,882 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,957 మంది కరోనా నుంచి కోలుకోగా, 140 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇప్పటివరకు 1,09,73,260 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,02,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,446 మంది మరణించారు.
Read More »దండి యాత్ర అద్భుత ఘట్టం : సీఎం కేసీఆర్
స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ …
Read More »రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ర్టం సాధించాం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు టీఆర్ఎస్ పార్టీకి మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. మీడియా పవర్ లేదు.. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. …
Read More »హాట్ భామ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే ఫిట్ నెస్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ఫిట్ నెస్ అంటే మనకు కనిపించే శరీరం మాత్రమే కాదు. బయటికి కనిపించే శరీరాన్ని బట్టి వ్యక్తి ఫిట్ నెస్ నిర్ధారించలేం. మానసిక ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్ నెస్ బాడీ, మనస్సుకు మధ్యలో ఉండే సమతుల్యతే దానికి అర్థం చెబుతుంది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రభాస్ మూవీ షూటింగ్ …
Read More »కర్ణాటక సీఎం పై సీడీ సంచలనం
కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం సీడీలు కలకలం రేపుతున్నాయి. అధికార బీజేపీతో పాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమవద్ద ఉన్నాయని ఒక పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడి యూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాశ్ తెలిపారు. కొద్దికాలంగా యడ్డీపై ఈయన విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా చేసిన సీడీ …
Read More »‘జాతిరత్నాలు మూవీకి తొలిరోజే షాక్
ఇటీవల విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జాతిరత్నాలు మూవీకి పైరసీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది విడుదలైన తొలి రోజునే ఈ మూవీ పైరసీ వర్షన్ ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చింది. అటు టెలిగ్రాం గ్రూపుల్లోనూ ఈ మూవీ పైరసీ వర్షన్ దర్శనమిచ్చింది ఇది చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది
Read More »తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717కు చేరింది. ఇక నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,650కు పెరిగింది. కరోనా నుంచి గురువారం రోజు 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 య్ాక్టివ్ కేసులున్నాయి
Read More »దేశంలో కొత్తగా 23,285 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.13 కోట్లు దాటింది. ఇక నిన్న 117 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి
Read More »