బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాశాడు. అటు చనిపోయే ముందు సోషల్ మీడియాలో తాను చనిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. ‘MS ధోనీ, కేసరీ’ మూవీల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ కన్పించాడు
Read More »తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »గురువారం తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …
Read More »రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?
రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది శరీరంలో ఐరన్ స్థాయి సమతుల్యం అవుతుంది వీటన్నింటితో పాటు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం లభిస్తుంది
Read More »దేశంలో ఇప్పటికి 85లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 85 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదన్న ఆయన.. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 97.29%గా ఉందని, ప్రపంచంలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు కూడా దేశంలోనే నమోదైందన్నారు. గత 7రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా …
Read More »నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్
విశ్వ విఖ్యాత సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. పార్టీ లో చేరాలనుకునే సభ్యులు 25 వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన సోమవారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేలో జరగనున్న ఎలక్షన్స్ కోసం …
Read More »రండి చేయి చేయి కలుపుదాం-ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్.హరిత వందనాలు వాస్తవాలను ప్రజల కళ్లముందుంచుతూ.. మంచిని వివరిస్తూ.. చెడును ఎత్తిచూపుతూ సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా పాత్ర వెలకట్టలేనిది. సమాజం పట్ల, పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల మీ నిబద్దత ఎల్లప్పుడూ …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా కరోనా బారీన పడి 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 11,805 మంది నిన్న డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,25,710 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన …
Read More »కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం-మహారాష్ట్ర మంత్రి విజయ్ ఓడేటివార్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విజయ్ ఓడేటివార్ కొనియాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో జీఆర్ఆర్ కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విజయ్ ఓడేటివార్ మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల …
Read More »