టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ యూత్ అద్యక్షుడు మిట్ట నిషాంత్ గౌడ్,ఎన్.ఎస్ యూ.ఐ నియోజకవర్గ ఇంచార్జ్ కపిల రాజేశ్ సుమారు 400 మందితో కలిసి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ …
Read More »దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలకు వివించారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచార సరళిని వారికి వివరించారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్రపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మరణంతో దుబ్బాకలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో రామలింగా రెడ్డి భార్య సుజాతను టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. మంత్రి హరీశ్రావు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలు వచ్చేనెల 3న జరగున్నాయి. …
Read More »ఏపీలో కొత్తగా నమోదైన 5,653 కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5,653 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ బారినపడిన వారిలో మరో 35 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,517 మంది కరోనా బారినపడగా 6,97,699 మంది కోలుకున్నారు. మరో 46,624 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు …
Read More »అసెంబ్లీలో కంగనా రనౌత్
అసెంబ్లీలో కంగనా రనౌత్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించనుంది. కరోనా వలన ఈ చిత్ర షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడగా, కొద్ది రోజుల క్రితం తాజా షెడ్యూల్ నిర్వహించారు. ఆ షెడ్యూల్ చిత్రీకరణ …
Read More »వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం
ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ సభ్యులు,మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బ్రెయిన్ స్ట్రోక్ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో పిల్లి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం …
Read More »తల్లి కాబోతున్న హీరోయిన్ అనిత
హీరోయిన్ అనిత అంటే నువ్వు నేను మూవీ వెంటనే గుర్తుకు వస్తుంది. దక్షిణాది సహా ఉత్తరాదిన కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న అనిత, కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా నటనకు దూరంగా ఉన్న అనిత, సోషల్ మీడియా ద్వారా తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. రోహిత్తో ప్రేమ నుండి ప్రెగ్నెన్సీ వరకు ఉన్న ప్రయాణాన్ని ఓ వీడియోగా చిత్రీకరించి …
Read More »పెళ్ళి పై అందాల రాక్షసి రాశీఖన్నా సంచలన వ్యాఖ్యలు
అందాల రాక్షసి రాశీఖన్నా యాంబిషియస్ పర్సన్.. ఆమెకు ఆత్మ విశ్వాసమూ ఎక్కువే.. అందానికి ఆమె ఇచ్చే నిర్వచనం కూడా అదే! వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా కనిపించే ఆమె వృత్తి విషయంలో చాలా కఠినం… లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన రాశీఖన్నా ఆ సమయంలో ఏం చేశారు? కరోనా ఆమెకు ఏం నేర్పించింది? ఈ ఆసక్తికర విషయాలను ఆమె ABN ‘నవ్య’తో పంచుకున్నారు. రాశీఖన్నా ఎవరు? రాశీఖన్నా గురించి చెప్పడం చాలా కష్టం. …
Read More »స్వయంగా వివరాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్.. నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్లో అప్లోడ్ చేశారు. అనంతరం …
Read More »తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో …
Read More »ఓటు హక్కుపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. విజయ్ తన ఆటిట్యూడ్తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని, అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందని విజయ్ …
Read More »