అసెంబ్లీలో కంగనా రనౌత్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించనుంది. కరోనా వలన ఈ చిత్ర షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడగా, కొద్ది రోజుల క్రితం తాజా షెడ్యూల్ నిర్వహించారు. ఆ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తైన విషయాన్ని కంగనా తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
జయ అమ్మ ఆశీర్వాదంతో తలైవి-ది రివల్యూషనరీ లీడర్ మరో షెడ్యూల్ని పూర్తి చేశాం. కరోనా వలన చాలా విషయాలలో మార్పులు జరిగాయి. కాని యాక్షన్, కట్ మధ్య జరిగేది ఏది మారలేదు. థ్యాంక్యూ టీమ్ అని కంగనా తన ఫోటోలను షేర్ చేస్తూ పేర్కొంది.