ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ (కోవిడ్ 19) విజృంభణ కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. పుత్తూరులో నారాయణ స్వామి నివాసం వద్ద పహారా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించగా.. నెగెటివ్గా తేలింది. …
Read More »బిగ్ బాస్ -4లో 4గురు హీరోయిన్స్
బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ నాగార్జున చేస్తాడు అని లేదు ఆయన కోడలు అక్కినేని సమంత చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ 4 గురించి మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో పాల్గొనే …
Read More »ఢిల్లీలో 80వేల కరోనా కేసులు
ఢిల్లీ కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతోంది. ప్రతీరోజు వేలల్లో కొత్త కరోనా కేసుల నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,948 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 80,188కి చేరింది. అయితే, ఢిల్లీలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్తా ఉపసమనం అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 49,301మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో …
Read More »ఆగస్టు 12వరకు రైళ్లు రద్దు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read More »తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 985 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో ఈ రోజు మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ రోజు 78 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి …
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల నమోదులో భారత్లో మరో కొత్త రికార్డు నమోదైంది. భారత్లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేసింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 17,296 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,90,401లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజకు ఉదయం వెల్లడించగా.. తాజాగా ఈ రోజు భారీ సంఖ్యలో నమోదు …
Read More »మహారాష్ట్రలో 5024.. దిల్లీలో 3460 కొత్త కేసులు
మహారాష్ట్ర, దిల్లీలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్రలో కొత్తగా 5024 పాజిటివ్ కేసులు, 175 మరణాలు నమోదు అయ్యాయి. దిల్లీ నగరంలో కొత్తగా 3460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 77240కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 47091 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »చైనాకు మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్ పేయ్ గుణపాఠం
చైనా కుటిల బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది. ముఖ్యంగా భారత్పై పైచేయి సాధించాలని చూసిన ప్రతిసారి ఎదురుదెబ్బలు తింటూనే ఉంటుంది. అలాంటి దేశానికి 1965లోనే భారత యువ ఎంపీ ఒకరు తన రాజకీయ తెలివితేటలతో చక్కటి గుణపాఠం నేర్పారు. ఆయన ఎవరో కాదు..భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ. 1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల …
Read More »మాస్కులు తయారీ కంపెనీలో కరోనా
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ …
Read More »ఇందిరను ముందే హెచ్చరించిన పీవీ
పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో …
Read More »