తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫాం హౌజ్ అని రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు బెంచ్. ఆధారాలు చూడకుండానే ఎన్జీటీ నోటీస్ జారీ చేయడం సబబు కాదు అని ఆ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు. ఆ భూమి సరిహద్దులు కూడా చూడకుండా, యాజమాన్య హక్కులు, పత్రాలు పరిశీలించకుండా కేవలం ఎవరో పిటిషన్ వేస్తే, గూగుల్ మ్యాప్ లో పేర్లు రాస్తే సరిపోతుందా అని తీవ్రంగా …
Read More »సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కేంద్ర హోం సహయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన నియంత్రణ చర్యలు,కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్న పలు సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు.రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ప్రజలకు భరోసా …
Read More »బీజేపీ నేతకు కరోనా
కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..
Read More »ఏపీలో డబుల్ సెంచురీ కొట్టిన కరోనా కేసుల సంఖ్య
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.ఏకంగా డబుల్ సెంచూరీ కొట్టింది కరోనా.గడిచిన ఇరవై నాలుగంటల్లో 216కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 ఏపీకి చెందినవి.మిగతావి ఇతర రాష్ట్రాల,దేశాల నుండి వచ్చిన వారికి సోకిన సంఖ్య అని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోన కేసుల సంఖ్య 3,990కి చేరుకుంది.ఇందులో 2,403మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు.1,510మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు..
Read More »ఢిల్లీ సీఎంకు కరోనా నెగిటివ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల స్వల్ప ఆస్వస్థతకు గురైన సంగతి విదితమే. దీంతో ఆయన ఇంటి దగ్గర వైద్యులు శాంపిల్స్ సేకరించారు.శాంపీల్స్ ను పరీక్షలకు పంపించగా నెగిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా సీఎం అరవింద్ జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి విధతమే..
Read More »నేడే జగనన్న చేదోడు పథకం
ఏపీ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానున్నది.తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు.. షాపులున్న రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,టైలర్లకు ఏడాదికి రూ.పది వేల చొప్పున అందజేయనున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా 2,47,040మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఇందుకు రూ.247.40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది..
Read More »ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు
కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..
Read More »జలపుష్పాలకు అడ్డా తెలంగాణ
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుతున్నారు. నిండు వేసవి రోజుల్లో ఎన్నో చెరువులు మత్తడి దుంకుతుండటంతో గ్రామీణ ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. గోదావరి జలాలతో ఒక్క రైతులే కాకుండా మత్స్యకారులు కూడా ఎంతో లాభపడుతున్నారు. రిజర్వాయర్లు, చెరువులు సమృద్ధిగా నీటితో …
Read More »కొత్త విద్యాసంవత్సరంపై కేంద్ర కీలక ప్రకటన
దేశ వ్యాప్తంగా రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020’ హ్యాష్ట్యాగ్ పేరుతో ట్విటర్, ఫేస్బుక్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘ …
Read More »మంత్రి సత్యావతి రాథోడ్ గొప్ప మనస్సు
ఆమె సహజంగానే దయామయి. ఎవరినీ నొప్పించని తత్వం. ఎవరైనా బాధపడితే చూడలేని మనస్తత్వం. అలాంటామె కళ్ల ముందు రోడ్డు మీద ఒక వాహనదారుడు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తే ఇక ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిజంగా నేడు ఈ సందర్భమే ఎదురైంది. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తుండగా మహబూబాబాద్ జిల్లా ఆలేరు దగ్గర …
Read More »