ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా వైరస్
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 184 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి 137 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,75,798కి చేరింది. మృతుల సంఖ్య 3,990కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Read More »రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నిధులు విడుదల
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి సంబంధించి 2016-17 నుంచి 2019-20 సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర …
Read More »రైతు వేదికలు…. చైతన్య దీపికలు- ఎమ్మెల్యే అరూరి….
రైతులంతా ఒక్కతాటిపై నడవాలి… సంఘటితమవ్వాలి… చైతన్యవంతులు కావాలి… లాభసాటి వ్యవసాయం చేయాలి… అందుకు ఒక వేదిక కావాలి… అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు.కాజిపేట మండలం మడికొండ, కడిపికొండ క్లస్టర్ల పరిధిలో 44లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మేయర్ గుండు సుధారాణి గార్లతో …
Read More »రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు.
రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, …
Read More »CMగా KCR ఉండటం అదృష్టం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన దీక్ష గుర్తుకు వస్తే ఒళ్లు పులకరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను, అమరుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణగా మారుస్తున్నారని కొనియాడారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలందరి అదృష్టమని వ్యాఖ్యానించారు.
Read More »కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధం
కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నదని, రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్ను ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. …
Read More »నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్లో చర్చించనున్నారు. …
Read More »రైతన్న కోసం రణమే.. పార్లమెంటులో గళమెత్తండి- సీఎం కేసీఆర్
ఆహారధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికే కాకుండా.. యావత్ దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ఆహారధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, పార్లమెంటు వేదికగా ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆదివారం ప్రగతిభవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ …
Read More »బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి ఉచితంగా మెడిసిన్ కిట్లు
తెలంగాణ రాష్ట్రంలో బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ఉచితంగా మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది బీపీ రోగులు, 7 లక్షల మంది షుగర్ రోగులు ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ సర్వేలో తేలింది. వీరికి ప్రభుత్వం ఇచ్చే కిట్లో నెలకు సరిపడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే బీపీ, షుగర్ మందులు ఉంటాయి. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ …
Read More »