తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్, మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి కేసీఆర్, మహమూద్ అలీ కుటుంబసభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమానికి కొత్తగా …
Read More »రెండోసారి సూర్యాపేటలో జగదీష్రెడ్డి ఘనవిజయం
సూర్యాపేట శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి పై అపార నమ్మకం ఉంచారు. ఓటింగ్ జరిగన తరువాత ఎవరికి వారు నాకు మెజార్టీ వస్తుంది, నాకు మెజార్టీ వస్తుంది అంటు ఎవరికి వారు లెక్కలు వేసిన ఓటరు మాత్రం జగదీష్రెడ్డికే ఓటు వేసి అండగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలో 52,418 ఓటు వేయగా ఎమ్మెల్యే జగదీష్రెడ్డికి 20,152 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి …
Read More »వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై ప్రతిరౌండ్లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్లోనూ ఆయన మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు.అన్ని బూత్ల లో, ప్రతి రౌండ్లో నన్నపునేని నరేందర్ …
Read More »వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ ఘనవిజయం
తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వర్ధన్నపేట ఒక్కటి.వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ గెలుపు ఓ అద్భుతమని నియోజకవర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అరూరికి బలమైన శ్రేణులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బాసటగా నిలిచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో రెండో స్థానం సాధించడానికి సరిపడా బంఫర్ మెజారిటీ ని అందించడం మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అరూరి రమేశ్ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి …
Read More »కేసీఆర్ ఆ సమయంలోనే ఎందుకు ప్రమాణస్వీకారం చేస్తున్నారో తెలుసా?
గులాబీ దళపతి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు చేసారు.తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పండితులతో చర్చల అనంతరం…. గురువారం ఉదయం సుబ్రమణ్య షష్ఠి మంచి ముహూర్తమేనని అనడంతో రేపు మధ్యాహ్నం 1.30కు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ …
Read More »టీఆర్ఎస్ గూటికి మరో ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల ముగిసిన వెంటనే అదే ఒరవడిలో కీలక పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ను కలిసి ఈ మేరకు తన అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్ను కలిసిన కోరుకంటి చందర్ టీఆర్ఎస్కు …
Read More »కోనసీమలో కేసీఆర్ కటౌట్…సోషల్ మీడియాలో హల్చల్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యమ నాయకుడి నుంచి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేతగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారిన్ని చేజిక్కించుకోవడంతో గులాబీ బాస్ కేసీఆర్కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయనకు లెక్కలేనన్ని విషెస్ వస్తున్నాయి. ఏపీ నుంచి ఏకంగా లక్ష …
Read More »తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గెలిపించడానికి గల కారణాలు ఇవే..పోసాని
58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పనితీరు ఒకవైపు ఈ నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి అందరు ఓటు వేసారని,చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకున్నారు చివరికి ఆ బాబు వల్లనే మీరు బోల్తా పడ్డారని పోసాని మురళీకృష్ణ అన్నారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై …
Read More »మహామహులు అనుకున్న నేతల్పి కూడా మట్టికరిపించిన.. టీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కీలక నేతలు ఓడిపోయారు. మహామహులు అనుకున్న నేతలు కూడా మట్టికరిచారు. టీఆర్ఎస్ దాదాపు 88 సీట్లలో, మహాకూటమి 21 స్థానాల్లో, మజ్లిస్ ఆరు స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అయితే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. రేవంత్పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రేవంత్ కంచుకోటలో …
Read More »గజ్వేల్లో కేసీఆర్ ఫైనల్ మెజారిటీ ఇది !
తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి సత్తా చాటింది. గజ్వేల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 51,515 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుబి మోగించారు. గత ఎన్నికల్లో కేసీఆర్కు 19,391 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంతో ఈసారి మెజార్టీ తగ్గుతుందా.. అంతకంటే పెరుగుతుందా అన్న అంశంపై ప్రజలు ఆసక్తి కనబర్చారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే 32,124ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ …
Read More »