జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్ …
Read More »లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీలో హైదరాబాద్ హవా
లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకింగ్లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్డీఐ బెంచ్మార్క్’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది. కొవిడ్ వ్యాప్తితో వైద్యారోగ్య …
Read More »ప్రపంచ విత్తన గని “తెలంగాణ”
తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన రాష్ర్టాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహించనున్నది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. …
Read More »ప్రత్యేక ఆకర్షణగా టెంపుల్ సిటీ
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు పచ్చదనానికి నిలయంగా మారుతున్నది. ఆలయ పరిసరాల్లో 98 రకాలకు చెందిన 4.21 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆలయానికి సులభంగా చేరుకునేలా రహదారి విస్తరణ పనులతోపాటు ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపుపై వైటీడీఏ దృష్టిసారించింది. వాహనాల రద్దీ కారణంగా కాలుష్య సమస్యలు తలెత్తకుండా రకరకాల మొక్కలు నాటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచే …
Read More »‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’
‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారు.కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక చేసిన విశ్లేషణలో సైతం ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణను ఒకటిగా తేల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విశ్లేషణలో దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్), దక్షిణ, …
Read More »కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …
Read More »రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలి
కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ రైజ్హోమ్ కాలనీలో శనివారం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కొవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ పూర్తయ్యిందని చెప్పారు. శనివారం నుంచి …
Read More »TRS పాలన వల్లే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలన వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురా డివిజన్లోని ఆజం ఫంక్షన్ హాల్లో పాతమలక్పేటకు చెందిన టీఆర్ఎస్ నేతలతో వరంగల్లో నిర్వహించి విజయోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మిగతా రాష్ర్టాల కంటే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా స్థానం దక్కించుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలతో రాష్ట్రం …
Read More »ఎదురులేని శక్తిగా TRS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు చేపట్టి, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నా, టీఆర్ఎస్కు సరిరావన్నారు. బుధవారం శామీర్పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి …
Read More »పారిస్ లో మంత్రి కేటీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్ ఎగువ సభలో (సెనేట్) జరిగే ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ ఎరా (కొవిడ్ తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …
Read More »