తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ విడుదలచేశారు. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కోసం జీవో-244 జారీచేశారు. సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు-1996కు సవరణ చేస్తూ జీవో-243 విడుదలచేశారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు …
Read More »విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్ సందర్భంగా స్కూల్ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం విడుదలచేసిన జీవో 48కి అనుగుణంగానే ఫీజులు వసూలుచేయాలని చెప్పారు. వచ్చేనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి …
Read More »ఏ ఎన్నికైన టీఆర్ఎస్దే బ్రహ్మాండ విజయం – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పుట్టాక, రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. అందులో హుజూరాబాద్ కూడా ఒకటి. అంతేతప్ప మరోటి కాదు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారే తప్ప.. హుజూరాబాద్ అనేపేరు ప్రస్తావించలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ వస్తే దాని ప్రస్తావన వస్తది. అప్పుడు పార్టీ చర్చిస్తది. అంతకుముందే పత్రికల్లో రాసినా.. టీవీల్లో చర్చించినా అదొక …
Read More »చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్కు రండి-ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్
సీఎం కేసీఆర్ ఏదిచేసినా ముందే అనుమానాలు వ్యక్తంచేస్తరు. బలహీనమైన గుండె ఉన్నవాళ్లు అవలీలగా ఢాం అని అడ్డంపడతరు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిననాడు, తెలంగాణ వస్తది అన్ననాడు కూడా ఇట్లానే పిచ్చిప్రేలాపనలు చేసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు దళితబంధు ప్రారంభిస్తే కూడా ఇట్లనే అంటున్నరు. ముందు నవ్వుతరు. వెకిలి మాటలు మాట్లడతరు. అవమానిస్తరు. ఆఖరికి గెలిచాక పక్కకొచ్చి ఫొటో దిగి పోతరు. అట్లా మాట్లాడేవాళ్లకు నిజంగా చిత్తశుద్ధి …
Read More »మరో 20 ఏళ్లు టీఆర్ఎస్దే అధికారం
రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి శాఖల పునర్నిర్మాణం వరకు సమావేశంలో చర్చించారు. అదేవిధంగా …
Read More »దళితబంధు పథకానికి మరో రూ. 200 కోట్లు విడుదల
దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు …
Read More »దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు మరో 500 కోట్లు
హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్లను విడుదలచేసింది. ఈ పథకం అమలుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలచేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల విడుదలతో కరీంనగర్లో దళితబంధు ప్రత్యేక ఖాతాకు మొత్తం రూ.వెయ్యి కోట్లు జమయ్యాయి. ఈనెల 16న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల మంజూరు పత్రాలను అందజేసి పథకానికి …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం మొండి చేయి చూపించినా.. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ రహదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి ఏం మేలు చేశారని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ …
Read More »తెలంగాణలో స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల …
Read More »బాధితుడి భార్యకు ఎల్వోసీ అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్వోసీ ని ఆయన భార్య ఉపేంద్రకు మంత్రి అందజేశారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్వోసీని అందజేశారు.
Read More »