Home / ANDHRAPRADESH / ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని అబాసుపాలు చేస్తున్నారు..

ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని అబాసుపాలు చేస్తున్నారు..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

See Also:బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..!

అయితే పార్టీ ఫిరాయింపులపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగ పోలిట్ బ్యూరో నేత ,మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు.అయితే ఆయన పరోక్షంగా చంద్రబాబు మీద ఫైర్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.అసలు విషయానికి వస్తే ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ దాటరని ఆయన వ్యాఖ్యానించారు.అయితే ముందు ఫిరాయింపులను ప్రోత్సహించింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే సంగతి తెలిసి మరి రావుల ఇలా మాట్లాడటం బాబును టార్గెట్ చేయడమే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat