తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పిచారు.
దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో 5 (దొంకేశ్వర్,కుద్వన్పూర్ ,ఆలూరు, పిప్రి,గోవిందపెట్)నూతనంగా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన జీవో కాపీ ని వ్యవసాయ శాఖామంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ కమిషనర్ వీర బ్రహ్మయ్య ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అందజేశారు.