Home / ANDHRAPRADESH / టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ నాయ‌కులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజనతో డీలా పడిపోయిన‌ అనేకమంది సీనియ‌ర్ నేత‌లు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ వైపు చూస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలోకి బారీగా వ‌లస‌ల జోరు జ‌రిగేలా కన్పిస్తోంది.

See Also:జగన్‌కు సీఎం అయ్యే ఛాన్స్‌ ఉందా.. సోష‌ల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!

ఈ నేపథ్యంలో కొండ్రు మురళి, మానుగుంట మహీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి.. ఇలా చాలామంది వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ అధినేత జగన్ దృష్టికి కూడా కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతల జాబితా చేరింది. వారు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తేలింది. అయితే ఈ జాబితాను ప్రశాంత్ కిషోర్ టీం కు అప్పగించినట్లు సమాచారం. మ‌రి ఈ పేరున్న నేతలపై ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు.. వారు పార్టీలో చేరితే ఎంత‌వ‌ర‌కు లాభం.. వారి విజయావకాశాలు ఎలా ఉంటాయి.. అన్నదానిపై పీకే టీం సర్వే చేస్తోందట. ఈ సర్వే వచ్చిన తర్వాత వైసీపీలో భారీగా చేరికలుంటాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద నియోజకవర్గాల పెంపు నిలిచిపోవడంతో జగన్ పార్టీలో చేరికలు మరింత ఎక్కువ కానున్నాయి వైసీపీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నారు.

See Also:వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat