Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్

ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చే వారికి మాత్రం మద్దతు తెలుపుతామన్నారు.

see also:టీడీపీ ఎంపీల అసలు రంగు ఇదే..అందరికి తెలిసేలా షేర్ చేయండి..(వీడియో)

గత ఎన్నికల్లో తాము కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని జగన్ తెలిపారు గత ఎన్నికల్లో చంద్రబాబు తాను అనుభవజ్ఞుడినని చెప్పుకోవడం, మోదీ హవా, పవన్ కల్యాణ్ మద్దతుతో ఆయన గద్దెనెక్కారని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తమ ఓటమికి అవే కారణాలయ్యాయని అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉందని, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలు గుర్తించారని జగన్ అన్నారు.

see also:మహిళల స్నానాలను కెమేరాలో బంధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న…దేవాదాయ శాఖ ఉద్యోగి

తాను అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకువస్తానని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము మాత్రమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందని, ఒకరితో పొత్తు కోసం, మద్దతు కోసం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని జగన్ చెప్పారు.

see also:జనసేనలో చేరిన టీం ఇండియా మాజీ క్రికెటర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat