వరుస అపజయాలతో సతమతమవతున్న సాయిధరమ్తేజ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంటనే మొదలు పెట్టకుండా ప్రెష్గా కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నతే తడవుగా మేకోవర్ కోసం, తన కెరియర్ను చక్కబెట్టుకునేందు కోసం విదేశాలకు వెళ్లాడు.
పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా వరుసగా హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపజయాలతో కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. మాస్లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో అనిపించుకున్నాడు. అయితే, సాయి ధరమ్ తేజ్కు హ్యాట్రిక్ హిట్స్ తరువాతనే అసలు సమస్య మొదలైంది. ఆ తరువాత చేసిన సినిమాలేవీ మెప్పించలేదు. రకరకాల జోనర్స్ ట్రై చేసినా విజయం రాలేదు.
దీంతో, ఇంకా ఆలస్యం చేస్తే మరిన్ని విమర్శలు, మరిన్ని ప్లాప్లు మూటగట్టుకోవల్సి వస్తుందేమోనని భావించిన సాయి ధరమ్తేజ్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. తన లుక్ను పూర్తిగా మార్చేసి ఆ తరువాత కథల సెలెక్షన్స్పై శ్రద్ధపెట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అమెరికా వెళ్లి కొత్త లుక్ కోసం మేకోవర్ చేయించుకుంటున్నాడు.