తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశాల్లో ఉన్న సంగతి విదితమే. ఆయన ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తనని నమ్ముకున్నవారి గురించే ఆరాటపడుతుంటారు.. ఆలోచిస్తుంటారు.. గత ఏడాది అన్న పెళ్లి రోజు కూడా తన కుటుంబ సభ్యులతో గడపకుండా నాగార్జున సాగర్ వెళ్లి నీళ్ళు వదిలిన మహామనిషి.. ఆ తర్వాత కాళేశ్వరం టూర్.. ప్రాజెక్టుల సందర్శన..బ్లా ..బ్లా..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు..
అయితే తాజాగా అమెరికాలో ఉన్న కానీ తన్నీరు హారీష్ రావు ఒక”WhatsApp”మెసేజ్ కు స్పందించి మరో సారి”తన్నీరు”ఎక్కడున్నా కానీ తన ఆలోచన.. తపన.. ఆరాటం తనను నమ్ముకున్న ప్రజలకోసమే..సమస్య అని తనని అశ్రయించినవారి కోసమే అని నిరూపించారు..
“ఉమ్మడి ఆదిలాబాద్”జిల్లాకు చెందిన “జ్యోతి”(19YRS)కి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ పాప తల్లిదండ్రులు”దీపక్”అనే యువకుడి ద్వారా తన్నీరు హారీష్ రావుకు వాట్సాప్ మెసేజ్ చేయించారు. దీనికి స్పందించిన హరీష్ రావు వెంటనే తన పీఏ వెంకటేశ్వర్లను కలవాల్సిందిగా సూచించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పీఏని సంప్రదించగా హైదరాబాద్ మహానగరంలోని “NIMS”ఆసుపత్రిలో జ్యోతిని చేర్పించి అక్కడ ఉన్న ఆర్ఎంఓ సింధు డాక్టర్ గారితో మాట్లాడి రూ.25లక్షల ఖర్చు అయ్యే వైద్యాన్ని రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తున్నారు హరీష్ రావు..