Home / 18+ / అనంతలో టీడీపీ భూస్థాపితం..? జగన్ దెబ్బకు !

అనంతలో టీడీపీ భూస్థాపితం..? జగన్ దెబ్బకు !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ తుడుచుకుపోయింది.రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.టీడీపీ కంచుకోట అని చెప్పుకునే జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.దీంతో డీలా పడ్డ ఆ పార్టీ నాయకులు ఇంత దారుణంగా ఓడిపోయామా అంటూ కలవరపడుతున్నారు.అయితే ఓడిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలి అని పాములు కదుపుతునట్టు తెలుస్తుంది. అనంత‌పురం పరంగా చూసుకుంటే అక్కడ టీడీపీ పరిస్థితి అయితే మొత్తం శూన్యం అని చెప్పాలి.ఇక్కడ ఎప్పటినుండో పరిటాల మరియు జేసీ ఫ్యామిలీదే పైచేయి.తరతరాలుగా వారే ఏలుతున్నారు.అయితే ఇప్పుడు జగన్ దెబ్బకు వాళ్ళ పరిస్థితి కూడా దారుణం అయిందనే చెప్పాలి.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పరిటాల సునీత బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం.2019లో తన కొడుకు శ్రీరామ్ పోటీ చేయగా ఘోరంగా ఓడిపోయాడు.దీంతో బీజీపీలో చేరుతున్నారని సమాచారం.ఇక జేసీ విషయానికి వస్తే కాంగ్రెస్ హయంలో ఒక వెలుగు వెలిగారనే చెప్పాలి.అనంతరం రాష్ట్ర విభజన తరువాత జేసీ టీడీపీలో చేరారు.2014లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాదించాడు.అదే 2019కి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.ఫ్యాన్ గాలి దెబ్బకు అందరు కొట్టుకుపోయారు.దీంతో జేసీ బ్రదర్స్ పతనం స్టార్ట్ అయిందనే చెప్పాలి.ఈమేరకు వీళ్ళు కూడా టీడీపీ నుండి బయటకు వచ్చేసి భాజాపాలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే కొందరు నాయకులతో చర్చించినట్టు తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat