Home / ANDHRAPRADESH / పరిటాల కుటుంబం నుండి రక్షించండి.. గ్రామస్తులు ఆందోళన !

పరిటాల కుటుంబం నుండి రక్షించండి.. గ్రామస్తులు ఆందోళన !

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఓటమిని తట్టుకోలేక పరిటాల శ్రీరామ్ అతని సహచరులు దాడులు చేస్తున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారి కుటుంబం పై శనివారం గ్రామస్తులు అందరు కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 4న వినాయక నిమజ్జనం ముగించుకొని తిరిగి ఇండ్లకు వెళ్తుండగా.. వెంకటాపురం నుండి శ్రీరామ్ మనుషులు 50 మందికి పైగా వచ్చి విచక్షణా రహితంగా దాడి చేసారని అన్నారు. ఇందులో బోయ సూర్యం అనే వ్యక్తిని హత్య చేయడానికి జరిగిన కుట్ర అని అన్నారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారని, భయంతో ఇళ్ళల్లోకి పరుగులు తీసామని అన్నారు. రామగిరి మండలంలో పరిటాల శ్రీరామ్ పట్టు తగ్గుతుందనే దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. గతంలో కూడా ఇలానే వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారని గుర్తుచేశారు. దాంతో శ్రీరామ్, అతడి అనుచరులు నుండి మీరే మాకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీని కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat