మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. చిత్రానికి మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమాతో దసరా పండుగ ముందుగానే వచ్చిందంటూ అభిమానులు సంబర పడుతున్నారు. ఈ మీటింగ్ లో చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా,జగపతిబాబు తదితరులు మాట్లాడారు. ఇందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. నా 12ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. ఈ చిత్రానికంటే ముందే స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించాలనుకున్నానని అన్నాడు.ఇంక ఇందులో ముఖ్య కారణం బడ్జెట్ అని…దీనికోసం చాలా అలోచించి నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. ఇక నయనతార, తమన్నా నటన విషయానికి వస్తే వారి పాత్రలో మునిగిపోయారని అన్నాడు. తమన్నా విషయానికి వస్తే సినిమాలో తన నటనకు ప్రత్యేకంగా అభినందనలు వస్తున్నాయని చెప్పారు.