Home / ANDHRAPRADESH / సీఎం జగన్ కు అందరూ ఫిదా

సీఎం జగన్ కు అందరూ ఫిదా

ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు.

ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం సందర్భంగా ఇద్దరు చిన్నారులు ముఖ్యమంత్రి జగన్ తో “అసలే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తాం. మాకోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. మీకెంత ధైర్యం సార్‌. మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా. మా కోసం ఇంగ్లీషు ప్రవేశపెడుతున్నారు.

మీకు ధన్యవాదాలు’ అంటూ ఙ్ఞాన ప్రసూన అనే విద్యార్థిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” మీ అమ్మనాన్న ,మీరు నన్ను నమ్మి గెలిపించినప్పుడు ఆర్థిక మాంధ్యం ఉందా.. కష్టాల్లో ఉందా అని ఆలోచించకుండా మీకు మేలు చేయాలనే సంకల్పం ముందు ఇవేమి కష్టంగా కన్పించడం లేదు. మీకు సేవ చేయడమే నా లక్ష్యమని”జవాబివ్వడంతో అక్కడున్నవారంతా ఫిదా అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat