Home / MOVIES / అర్జున్ సురవరంకు షాక్..!

అర్జున్ సురవరంకు షాక్..!

నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో బాగానే రన్ అవుతున్న వేళ.. ఆ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లో దొరకటం చూసిన నిఖిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దానికి సంబందించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. తన చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలపై తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ నుంచి ఊహించని రీతిలో నిఖిల్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెప్పడానికి ఈ యువహీరో దిమ్మ తిరిగిందనే చెప్పాలి. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే థియేటర్లలో టికెట్ రేటు కంటే పాప్ కార్న్ ధర ఎక్కువగా ఉంటుందని. నిర్మాతలు.. నటులు.. దర్శకులు ఇతర సినీ ప్రముఖులు ఈ విషయాల్ని మర్చిపోతున్నారని. ఒక మల్టీఫ్లెక్స్ లో సినిమా చూసేందుకు వెళితే అరలీటరు వాటర్ బాటిల్ ను రూ.60కు అమ్ముతున్నారు. థియేటర్ బయట రూ.20కు దొరికే బాటిల్ ను రూ.120కు అమ్ముతున్నారు. ఇదెంతవరకూ న్యాయం? అని ప్రశ్నించారు.
దీనికి నిఖిల్ స్పందిస్తూ నేనూ ఒక ఫేమస్ థియేటర్ కు వెళ్లాను అక్కడ డైట్ కోక్ కు రూ.300 తీసుకున్నారు.. ఆ ధర చూసి తానే ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. అక్కడ అమ్మే వ్యక్తిని నిలదీశానని.. తప్పు అతనిది కాదు మల్టీఫ్లెక్సులు ఆ ధరలు నిర్ణయించినట్లు చెప్పాడని తనకు ఎదురైన సంఘటనను చెప్పుకొచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat