బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు.
ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను.
ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సర్దుబాటు చేస్తానని చెప్పాడు అని ఆయన తెలిపారు. త్వరలోనే కొత్త ఎన్సీఏను ప్రారంభిస్తామని దాదా పేర్కొన్నాడు.