ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు.
అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
అమరావతి పరిరక్షణ పేరుతో చంద్రబాబు చేస్తున్న కార్యక్రమానికి ప్రజల మద్ధతు లేకపోవడంతో.. అందుకే ఈ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటాయని వారు డుమ్మా కొట్టారు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.