ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి.
తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక్క నరసరావుపేటలోనే 15 మంది ఉన్నారు. కృష్ణాజిల్లాలో మరో 13కేసులు నమోదయ్యాయి. సచివాలయంలోని ఓ కీలక శాఖలో పనిచేస్తున్న అటెండరుకు ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వ వర్గాల్లో అలజడి మొదలైంది.
వీటితో కలిపి ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 223కు పెరిగింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 40 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 332కి చేరింది. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న సీనియర్ రెసిడెంట్కు కరోనా నిర్ధారణ అయింది