తెలంగాణ హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మే 6 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు.