కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని తన నివాసంలోపలువురితో కలిసి మంత్రి జగదీష్ రెడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన గులాబీ కండువా కప్పి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా అయోధ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరడం సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ …
Read More »అమిత్షా-ఎన్టీఆర్ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్రెడ్డి
కేంద్రహోంమంత్రి అమిత్షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. అమిత్షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …
Read More »ఎన్టీఆర్తో అమిత్షా మీటింగ్.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
ప్రముఖ నటుడు ఎన్టీఆర్తో కేంద్ర హోంమంత్రి అమిత్షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …
Read More »ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్
మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్లో …
Read More »బిగ్ బ్రేకింగ్.. అమిత్షాతో ఎన్టీఆర్ భేటీ.. ఎందుకబ్బా!
ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …
Read More »అమిత్షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్
కేంద్రహోంమంత్రి అమిత్షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వేర్వేరుగా అమిత్షాతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద సాయం కోసం అమిత్షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే …
Read More »మోదీ బాటలోనే వారంతా.. మరి మీరు..?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …
Read More »సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్తో అమిత్షా ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్షా ప్రశంసించారు.
Read More »నేడు ఢిల్లీకి జగన్..రాష్ట్రానికి ఇది ఎంతో కీలకం !
హోంమంత్రి అమిత్ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీనిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర …
Read More »రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read More »