తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లకు దొరల గడీ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయ వేడిని పెంచుతున్న విషయం తెలిసిందే.
Read More »వైరల్ అవుతోన్న ఎర్రోళ్ల శ్రీను చెప్పిన పారాచ్యూట్ కథ
ఆత్మీయ సమ్మేళనంలో పారాచ్యూట్ కథ జనం మనసును కదిలించింది. అధికారం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల ఎట్ల ఆరాటపడుతున్నాయో కండ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించింది. బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ తన ప్రసంగంతో మెప్పించారు. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ల నైజాన్ని ‘ఒక విమానం… నాలుగు పారాచ్యూట్’ కథతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.ఆ కథ కమామిషు ఏమిటంటే …
Read More »కష్టం రాష్ర్టానిది.. కాసులు కేంద్రానికి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగురోడ్డు (త్రిఫుల్ ఆర్)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేస్తున్నది. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు టోల్ట్యాక్స్ రూపంలో తాము రాబట్టుకొని, భూసేకరణ ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపాలని ఎత్తుగడ వేసింది. ఉల్టాచోర్ కోత్వాల్ కో డాంటే అనే చందంగా తప్పంతా …
Read More »మాజీ మంత్రి జూపల్లి,మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.
Read More »టీఎస్పీఎస్సీ నిర్వహించిన మరో పరీక్షపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన సీడీపీవో , గ్రేడ్ 1 సూపర్వైజర్ నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు లో పిటిషన్ వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్లో కోరారు. …
Read More »రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్లో రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో …
Read More »చిన్నారి వైద్యానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సండ్ర.
తల్లాడ మండలం, నారాయణపురం గ్రామంలో నాయిబ్రాహ్మణ నిరుపేద కుటుంబానికి చెందిన బేబీ అద్య 5 సంవత్సరాల నుండి చెవుల వినికిడి సమస్యతో బాధపడుతూ వైద్యానికి ఆదుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని సంప్రదించగా తక్షణమే స్పందించి హాస్పటల్ వైద్యులతో మాట్లాడి వైద్య ఖర్చుల ఎస్టిమేషన్ ను తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాద్ నందు ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »లంకపై కివీస్ ఘన విజయం
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ …
Read More »