టాలీవుడ్లో కొద్ది సంవత్సరాలు ప్రేమించుకొంటున్న అక్కినేని నాగచైతన్య, సమంత జీవిత భాగస్వాములుగా మారారు. వీరి వివాహం గోవాలో వేద మంత్రాల నడుమ, హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిేన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జంట హనీమూన్ లో మునిగి తేలుతున్నారు.
హనీమూన్ ఎంజాయ్ ..
నాగచైతన్య, సమంతలు ప్రస్తుతం లండన్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత చైతూ, సమంత ఇద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లనున్నారు. స్కాట్లాండ్ ట్రిప్తో హనీమూన్ పూర్తి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ తమ తమ షూటింగ్స్తో బిజీ కానున్నారు. సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన రంగస్థలం 1985 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హనీమూన్ పూర్తి కాగానే సామ్ ఇండియాకు తిరిగొచ్చేసి రంగస్థలం షూటింగ్కి హాజరుకానుంది. ఇక చైతూ పరిస్థితి కూడా అంతే. సామ్తో హనీమూన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత తన అప్కమింగ్ చిత్రాల షూటింగ్తో చైతూ బిజీ కానున్నాడు.
