నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు లక్ష ఇండ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.
