గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే..ఈ నేపధ్యంలో ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్ లలో బీజీపీ తన విజయపతాకం ఎగురవేసింది. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాల్లో వందకు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ లోని 68 స్థానాల్లో దాదాపు 40 కిపైగా స్థానాలను కైవసం చేసుకుంది. గుజరాత్ తో ఆరోసారి అధికారం బీజేపీ కే దక్కింది . అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు మొదట తారుమారయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.ఒక దశలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత కనబరిచినా, మళ్లీ వెనుకబడిపోయింది.నోట్ల రద్దు, జీఎస్టీ వంటి మోదీ సర్కార్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపినట్టు గుజరాత్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయనే అంచనాలూ వెల్లడవుతున్నాయి.
