గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓడిపోతామని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ చేయకూడని పనులన్నీ చేశారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు.ఇవాళ ఆయన గాంధీభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…సొంత ఊరిలో ఓడిపోయిన మోదీ గుజరాత్ లో గెలిచినట్టా? అభివృద్ధిని వదిలిపెట్టి కుల, మతతత్వ రాజకీయాలతో ప్రచారం చేశారు. ఒక్క రాహుల్ గాంధీ ని ఎదుర్కోవటానికి 182 మంది బీజేపీ నేతలు కావాల్సి వచ్చింది. తన హత్యకి సుఫారి ఇచ్చింది నిజం అయితే ఎందుకు మోదీ చర్యలు తీసుకోరు? మోదీ హత్యకి పాక్ సుపారి తీసుకుంటే యుద్ధం ప్రకటించండి అని అన్నారు . ప్రధాని అంటే దేశం మొత్తానికి ప్రతినిధి అని, ఆయన చాలా హుందాగా వ్యవహరించాల్సిందని, కానీ, చిన్న రాష్ట్రం అది కూడా తన సొంత రాష్ట్రంలో ఓడిపోతామేమో అనే భయంతో దిగజారి వ్యవహరించారని దుయ్యబట్టారు.
