తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రజినీ రాజకీయ అరేంగేట్రం నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో వేడిరగులుతోంది. తమిళనాట వచ్చే కొత్త సంవత్సరం మరో పార్టీ పురుడుపోసుకోనుంది. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లో రానున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఇవాళ కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులను కలుసుకున్నారు. తన అభిమానులను మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తాను హీరో కావాలని సినిమాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. హీరోగా తన తొలి సంపాదన 50 వేల రూపాయలనితెలిపారు . తాను రాజకీయాల్లోకి రావడమంటే విజయం సాధించినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా తన రాజకీయ ప్రవేశంపై రాజకీయ ప్రవేశంపై ఈ నెల 31వ తేదీన ప్రకటన చేస్తానని రజనీకాంత్ చెప్పారు.
