Home / NATIONAL / జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన విషయం చెప్పిన సీఎం కేసీఆర్

జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన విషయం చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ మధ్య ఢిలీలో కేంద్ర హోంమంత్రితో కలిసినపుడు జరిగిన అసక్తికర విషయం చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే..

” ఏం కేసీఆర్ సాబ్ మీ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరాకు 8 వేల రూపాయల పెట్టబడి ఇస్తున్నారటగా.. అవునండీ కొత్త రాష్ట్రం మాది, ఉమ్మడి రాష్ట్రంలో మా రైతులు చాలా నష్టపోయారు అందుకే వారిని ఆదుకోవాడానికే ఈ పథకం.. అని నేను రాజ్‌నాథ్ సింగ్‌కు చెప్పిన. మరి దాన్ని రైతులు తిరిగి ఎలా చెల్లిస్తారు? అని రాజ్‌నాథ్ నన్ను అడిగినారు. ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు, అంతా మాఫీయే.. అని నేనన్నాను. ఈ మాట విన్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చక్కరొచ్చినంత పనయింది. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నది కదా.. కేంద్ర రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా కేసీఆర్ అని రాజ్‌నాథ్ నన్ను అడిగారు. అలాంటి ఆలోచన ఏమీ లేదు.. ఈ జన్మకు నా తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటా.. తెలంగాణలోనే ఉంటా అని నేను హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌కు చెప్పిన “ అంటూ ఢిల్లీ ముచ్చట చెప్పి సభలో అందరిని ఆశ్చర్య పరిచారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat