Home / SLIDER / తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు …

తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు …

పేదల అభి­వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథ­కా­లను అమలు చేస్తు­న్న­దని వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మా­రెడ్డి అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌­న­గ­ర్‌­లో ­నూ­త­నంగా నిర్మిం­చిన రెడ్డి సేవా సమితి భవ­నాన్ని ఆది­వారం ఆయన మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవ­సా­యా­నికి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యు­త్‌ను అంది­స్తు­న్నా­మని చెప్పారు. కులాల ప్రాతి­ప­ది­కన కాకుం­డా ­పే­దల ఆధా­రంగా రిజ­ర్వే­షన్లు ఉంటే బాగుం­టుం­దని అభి­ప్రా­య­ప­డ్డారు.రెడ్డి ­కు­లస్థుల సంక్షే­మా­నికి సీఎం కేసీ­ఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపు­తు­న్నా­రని తెలి­పారు.
షాద్‌­న­గర్‌ రెడ్డి సేవా సమితి అభి­వృ­ద్ధికి రూ.5 లక్ష­లు ­వి­రా­ళంగా ఇస్తు­న్నట్టు మంత్రి ప్రక­టిం­చారు. ఎంపీ జితేం­ద­ర్‌­రెడ్డి మాట్లా­డు­తూ ­రెడ్డి కులస్థులు రాజాబహు­దూర్‌ వెంక­ట్‌­రాం­రె­డ్డిని ఆద­ర్శంగా తీసు­కో­వా­ల­న్నారు. రెడ్డి సేవా సమితి అభి­వృ­ద్ధికి తన­వం­తుగా రూ.5 లక్షల విరాళం ఇస్తు­న్నట్టు తెలిపారు. అనం­తరం రెడ్డి సేవా సమితి నూతన సంవ­త్సరం క్యాలెం­డ­ర్‌ను ఆవి­ష్క­రిం­చారు. కార్య­క్ర­మంలో షాద్‌­న­గర్‌ ఎమ్మెల్యే అంజ­య్య ­యా­దవ్‌, మాజీ ఎమ్మెల్యే సీ ప్రతా­ప్‌­రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat