మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి… తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ హిట్ సాయి పల్లవి వల్ల వచ్చిందని కొంతమంది మీడియాలో రాయడం వల్ల ఆమెకి పొగరు తలకెక్కినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆమె తర్వాత నటించిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి షూటింగ్ సమయంలో ఎవరి మాట వినకుండా సాయి పల్లవి చిత్ర బృందానికి చుక్కలు చూపించిందని రకరకాల వార్తలు కూడా ట్రాల్ అయ్యాయి.
ఇక తాజాగా నాగశౌర్యతో కణం అనే ద్వి భాష చిత్రంలో నటిస్తోంది పల్లవి. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ సిద్ధమవగా.. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నాగశౌర్య సాయి పల్లవి గురించి సంచలన కామెంట్స్ చేశారు. సాయి పల్లవి ఇతరులతో గొడవ పడిన సంగతి నాకు తెలియదు గానీ.. నా సినిమా షూటింగ్ సమయంలోను సాయి పల్లవితో గొడవలు వచ్చాయని స్పష్టం చేశారు. అలాగే మరో రూమర్ పై మాట్లాడుతూ.. ఫిదా చిత్ర సక్సస్ క్రెడిట్ ఒక్క సాయి పల్లవిదే కాదని అన్నారు. శేఖర్ కమ్ముల అలాంటి కథ రాయకున్నా, వరుణ్ తేజ్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ చేయకున్నా సినిమా హిట్ అయ్యేది కాదని, కాబట్టి సాయి పల్లవిది మాత్రమే క్రెడిట్ అనడం సరికాదని వివరించారు. మరి ఈ కామెంట్స్ పై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.