పద్మావతి సినిమా వ్యతిరేక సెగ హైదరాబాద్కు తాకింది. ఈ నెల 25న సినిమా విడుదల సందర్భంగా సికింద్రాబాద్లోని టివోలి ఎక్స్ ట్రీమ్ సినిమా ధియేటర్లో ఈ సినిమా ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలువురు యువకులు థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. సినిమా పోస్టర్లను యువకులు చింపివేశారు.
దాదాపు 35 మంది మార్వాడీ యువకులు వచ్చి పోస్టర్స్ ను చింపివేశారని థియేటర్ యాజమాన్యం తెలిపింది. పోలీసుల రాకతో జై మార్వాడీ, బన్సాలి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ యువకులు వెళ్లిపోయినట్లు వివరించారు.