జనసేన అధినేత జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ యస్ఐ చిరంజీవి కాలుపైకి ఏక్కిన సినీహీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారు…కొత్తగూడెం నుండి ర్యాలీ గా ఖమ్మం వస్తుండగా స్థానిక గోపాలపురం వద్ద యస్ఐ చిరంజీవి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా ఎడమ కాలుపైకి ఎక్కడం తో మడమ విరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. చెల్లాచెదురైన పవన్ అభిమానులు ఒకవైపునకు పరుగు తీశారు. దీంతో ఆ వెనుకే మరికొందరిని అదుపు చేస్తున్న ఎస్సై చిరంజీవితో పాటు భద్రాద్రికి చెందిన ఓ అభిమాని కాలూ విరిగింది. పోలీసుల లాఠీ ఛార్జ్తో ఓ అభిమాని స్పృహ తప్పి పడిపోయాడు.
