తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రో కోదండరామ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ..దానికి తగ్గట్లు సరికొత్త రాజకీయ పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రో కోడండ రామ్ జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులే హరించబడుతున్నాయి.అందులో భాగంగా మందా కృష్ణ మాదిగ ,వంటేరు ప్రతాప్ రెడ్డి లను అక్రమంగా అరెస్ట్ చేశారు.ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దానికి ఒకవేదికగా రాజకీయ పార్టీను ఏర్పాటు చేయాలి.
అందుకే వచ్చే నెల ఫిబ్రవరి నెలలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తాను ఆయన అన్నారు.అయితే గత కొంత కాలంగా కోదండరామ్ పార్టీ ఏర్పాటు చేస్తారు.దానికి సంబంధించిన ఎలక్షన్ కమీషన్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.అందుకే ఆయన ఇటివల ఢిల్లీ కు కూడా వెళ్లారు అని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించిన సంగతి తెల్సిందే .