జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ చలోరే చలోరే చల్” అనే కార్యక్రమంతో తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన యాత్రలో భాగంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన పూర్తయింది.ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విరామం ఇచ్చారు.రేపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు అనంతపురం జిల్లలో పర్యటిస్తారని ఆ పార్టీ మీడియా హెడ్ హరి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.