ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చేసిని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో కాదని.. ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం చేయాలని మండి పడ్డారు. తాజాగా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఇకనైనా నోరుతెరవాలని.. లేకపోతే ఆంధ్రా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని.. ఏపీ ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరుమెదపలేదని ఆయన ఫైర్ అయ్యారు.
శ్రీకాకులంలో అధికారుల పై చంద్రబాబు ప్రతాపం చూపియ్యడం కాదని, తనకే మాత్రం విశ్వసనీయత.. ధైర్యం ఉన్నా.. రాజధాని ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. ఇక అంతటితో ఆగని చలసాని.. సీయం చంద్రబాబుకు అంత ధైర్యం లేకపోతే.. మోదీ ముందు మాట్లాడే ధైర్యం కావాలంటే ఒకసారి గదిలోకి వెళ్ళి ఎన్టీఆర్ చిత్ర పటాన్ని చూడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతా దిక్కుమాలిన సలహాదారులు దొరికారని, వారి సలహాలు తీసుకుంటే ఏపీకి అన్యాయం జరగడం ఖాయమని..ఇప్పటికే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్న చేయాలంటే.. టీడీపీ ఎంపీలు, మంత్రులు, భయపడుతున్నారని.. దీంతో ప్రజలు దమ్మెత్తి పోస్తారని.. ఆయన ఎంపీలు ఢీల్లీలో నాటకాలు ఆడుతున్నారన్నారు. ఇలా నాటకాలు ఆడుతున్న ఆస్కార్ అవార్డులు ఇవ్వకపోవడ చాలా దురదృష్టకరం అని.. వారికోసం పోలిటికల్ ఆస్కార్ అవార్డులు ఇవ్వాలన్నారు.