రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు.
భారతదేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో కోటి 60 లక్షల ఎకరాలకు పైగా సాగులో ఉందని తెలిపారు . రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్లే వచ్చిందన్నారు. దేశ రైతులను అర్థం చేసుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ దారుణంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు.కరీంనగర్ గడ్డ మీద సింహగర్జన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు.అందరం కలిస్తేనే మనం అనుకున్నా గమ్యం చేరుకోగలం అని అన్నారు.
see also : టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…
రైతాంగానికి అన్ని రకాలుగా ఆదుకోవడం పెద్ద కష్టమేమి కాదన్నారు.సమైక్య పాలనలో 75వేల చెరువులు ద్వంసం అయ్యాయని అన్నారు.ఉద్యమంలాగా మిషన్ కాకతీయ పథకం జరుగుతుందన్నారు.పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లన్నీ ఒక్కటిగా పూర్తి అవుతున్నాయి…కాళేశ్వరం నీళ్ళు వస్తే వర్షం కోసం చూడాల్సిన అవసరం రాదన్నారు.త్వరలోనే 65టీ ఎం సీ ల గోదావరి నీళ్ళు ఏడాదంత ఉండబోతున్న యి అని చెప్పారు.
see also :హోటల్రూమ్లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?
ఈ బడ్జెట్ లో భారీ నీటిపారుదల శాఖ కు భారీగా నిధులు సమకుర్చమన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని అపోహలు కల్పించారన్నారు.రూ.12 వేల కోట్లతో రెండు పంటలకు కలిపి..ఎకరాకు రూ.8 వేలు ఇచ్చేలా పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు.రైతు సమన్వయ సమితిలో లక్షా 61 వేల మంది సబ్యులు ఉన్నారన్నారు.రైతు సమన్వయ సమితికి పెద్దకాపుగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉంటారని అన్నారు.ప్రపంచంలో యునియన్ లేనిదీ ఒక్క రైతులకే అని స్పష్టం చేశారు.దేశానికి అన్నం పెట్టె రైతన్న నిజాయితీ గా ఉండాలన్నారు.