తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు.
see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!
కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పారు.బీజేపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారన్నారు. నాలుగేళ్లలో రైతుకు మేలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు.రైతాంగానికి ఆ పార్టీ చేసేందేమీలేదన్నారు.రైతుల ఆత్మహత్యలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయన్నారు. కేసులు పెడుతామని సీఎంలను బెదిరించడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటేనని పల్లా మండిపడ్డారు.
see also :అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!!
see also :శ్రీదేవిను చూడకపోయిన ఆమె మంచితనాన్ని చూశాను -అంధుడైన వీరాభిమాని..