నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి ఫలించింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎంపీ కవితకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
తన ప్రయత్నం కొనసాగిస్తూ ఆగస్టు1 న మరోసారి ఎంపీ కవిత లేఖ రాశారు. స్పందించిన రైల్వే మంత్రి సోలార్ ప్లాంట్ ను మంజూరు చేశారు. త్వరలో నిజామాబాదు రైల్వే స్టేషనులో 85 kwp సోలార్ ప్లాంట్ పనులు మొదలవుతాయి. ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియ ను దక్షిణ మధ్య రైల్వే కు అప్పగించారు. సోలార్ పవర్ ఏర్పాటు వల్ల రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలు తెలిపే బోర్డు లు, లైట్లు మరింత ప్రకాశవంతగా కనిపించనున్నాయి. స్టేషన్లో పవర్ కట్ అయితే జనరేటర్లను వాడుతున్న నేపథ్యంలో సోలార్ పవర్ వల్ల వ్యయం తగ్గనుంది. సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు చేసిన మంత్రి పీయూష్ గోయాల్ కు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా కృత్ఞతలు తెలిపారు.
see also :రాగిజావ తీసుకుంటే కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే..!