ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న ప్రత్యేక హోదా పుణ్యమా అని ఫిరాయింపు వైసీపీ ఎంపీలు తిరిగి తమ గూటికి చేరాలని ఉవ్విరుల్లుతున్నారు అని రాష్ట్ర రాజకీయాల్లో టాక్ .
See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెల్సిందే.దీనిపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ గందరగోళంగా ఉండటం వలన ప్రస్తుతం అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే సభ్యులను లెక్కపెట్టే వీలు లేదు అని చెప్పేశారు.అయితే మరోవైపు టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెడతామని ఇప్పటికే తేల్చేసింది.అయితే సోమవారం సభలో అవిశ్వాస తీర్మానం గురించి చర్చించే వీలుండటంతో వైసీపీ ,టీడీపీ పార్టీ లు తమ ఎంపీలకు విప్ జారీచేసే వీలుంటుంది.దీంతో ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎంపీలు కొత్తపల్లి గీత ,బుట్టా రేణుక,ఎస్పీవై రెడ్డి తప్పకుండ గెలిచిన గుర్తున్న పార్టీ విప్ జారిచేస్తే తప్పకుండా దాన్ని పాటించాలి.
See Also:YSRCPశ్రేణులకు గుడ్ న్యూస్-జగన్పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
ఇది ప్రతినిధుల చట్టంలోనిది.అయితే ఒకవేళ వైసీపీ పార్టీ విప్ జారీచేసి ..ఎంపీలు వైసీపీ బాటలో నడవకపోతే తమ పార్టీ గుర్తు మీదగెలిచి వేరే పార్టీలో చేరిన ఎంపీలపై వేటు వేయాలని వైసీపీ కోరే వీలుంటుంది.దీంతో స్పీకర్ తప్పకుండ ఆ ముగ్గురు ఎంపీల మీద వేటు వేయడం ఖాయం .ఎందుకంటే ఇటివల బీహార్ రాష్ట్రానికి చెందిన పార్టీ పార్టీనుండి బయటకు వెళ్ళిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరగానే రాజ్యసభ స్పీకర్ వేటు వేసిన సంగతి తెల్సిందే.
See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!
ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే తమపై వేటు వేయించుకోవడం కంటే వైసీపీలో ఉన్నామనే సంకేతాలు అవిశ్వాస తీర్మానం మీద చర్చ సమయంలో వ్యవహరిస్తే చాలు అనే భావనలో ముగ్గురు ఎంపీలు ఉన్నట్లు టాక్ .అయితే ప్రస్తుతం ఇటు టీడీపీ అటు బీజేపీ స్పెషల్ స్టేటస్ మీద వెనక్కి పోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఇప్పుడు టీడీపీ నుండి పోటి చేస్తే ఓడిపోవడం ఖాయమనే విషయాన్నీ గుర్తు ఎరిగారు కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ ..అంతే కాకుండా పార్టీ మారినప్పుడు బాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నేరవేర్చకపోవడంతో బ్యాక్ టూ హోం అనే ఆలోచనలో సదరు ఎంపీ ఉన్నారని జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతుంది..