తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందజేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖాలో ఉన్న మొత్తం పద్దెనిమిది వేల ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా వచ్చే నెలలో రెండో వారం లేదా మూడో వారంలో నోటిపికేషన్ విడుదల చేయడానికి పోలీసు శాఖ సిద్ధమవుతుంది.ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత 2015లో తొమ్మిది వేల ఆరువందల కానిస్టేబుల్ పోస్టులు,ఐదు వందల ముప్పై తొమ్మిది ఎస్సై పోస్టులను భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే.