Home / POLITICS / రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!

రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ప్రసంగిస్తూ..పార్టీ నేతలను ,కార్యకర్తలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెలిపారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం జరుగుతుందని చెప్పారు. శివాయిగూడెం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంగణం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని …శివాయిగూడెం కేటీఆర్ సభకు జనం భారీగా వస్తారని చెప్పారు.ఓకేరోజు ఒకేచోట 216 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat