తెలుగుదేశం పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తన జన్మదినం సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు జన్మదినం నాడు దీక్ష చేయడం బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు.కేంద్రం, మోదీపై సీఎం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని అన్నారు. బాబు చేస్తున్న ఈ ధర్మపోరాటం తో ప్రధాని మోదీ పీఠం కదలడం ఖాయమని..రాజకీయ కక్ష్యతోనే కేంద్రం ఏపీకి నిధులు, హోదా ఇవ్వడంలేదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
