Home / ANDHRAPRADESH / ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..

ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఐదేండ్లు కాదు పదేండ్లు కాదు పదిహేను ఏండ్లు ఇస్తామని చెప్పి టీడీపీతో కల్సి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికార పీఠాన్నిదక్కించుకుంది.అయితే అధికారంలోకి వచ్చి నాలుగు ఏండ్లు అయిన కానీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చడంలో విఫలమైంది.

దీనికి నిరసనగా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు.అయితే ప్రత్యేక హోదాపై గత నాలుగు ఏండ్లుగా అలుపు ఎరగని పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర సర్కారు చేసిన అన్యాయానికి నిరసనగా పార్లమెంటు సమావేశాల్లో ఎన్నడు లేని విధంగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు రోజులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

అయితే కేంద్రం దిగిరాకపోవడంతో జగన్ వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయించాడు.తాజాగా రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున మరో సంచలన చారిత్రకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అందులో భాగంగా రేపు వైసీపీ పార్టీకి చెందిన నలబై నాలుగు మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడు.ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,విభజన హామీలను నెరవేర్చడంలో ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు .రేపు ఎమ్మెల్యేల రాజీనామా గురించి ప్రకటన చేయనున్నారు .దీంతో టీడీపీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat